ఖైరతాబాద్ గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. ఎన్టీఆర్ మార్గ్ క్రేన్ నెంబర్ 4 దగ్గర 63 అడుగుల ఖైరతాబాద్ గణేషున్ని భారీ క్రేన్ సాయంతో నిమజ్జనం చేశారు. ఈ అపూర్వ ఘట్టాన్ని తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. గణపతిబప్ప మోరియా అంటూ భక్తులు నినాదాలు చేస్తూ గణనాథునికి వీడ్కోలు పలికారు.
ALSO READ: ఇంత త్వరగానా : ట్యాంక్ బండ్ ఎక్కేసిన ఖైరతాబాద్ గణనాథుడు
మహాగణపతి శోభయాత్ర ఖైరతాబాద్ నుంచి టెలిఫోన్ భవన్ మీదుగా ట్యాంక్బండ్ వరకు సాగింది. ఇక్కడ చివరిసారిగా నిర్వాహకులు మహాగణపతికి పూజలు నిర్వహించారు. నిమజ్జనం సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శోభాయాత్ర కొనసాగే మార్గాలలో ట్రాఫిక్ మళ్లించారు. ఈ ఏడాది ‘శ్రీ దశమహా విద్యా గణపతి’గా భక్తులకు ఖైరతాబాద్ గణేషుడు దర్శనమించాడు.