
కామేపల్లి, వెలుగు : కామేపల్లి పశువైద్యశాలను ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంతకుముందు పీహెచ్సీని పరిశీలించారు. సమస్యలపై ప్రజలను ఆరా తీశారు. వైద్యశాలలో సిబ్బంది, సరిపోను అందుబాటులో ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.
పశువైద్యాశాల శిథిలావస్థకు చేరడంతోపాటు ఇక్కడ సరైన మందులు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు కలెక్టర్దృష్టికి తెచ్చారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుధాకర్, పలువురు డాక్టర్లు పాల్గొన్నారు.