ఎవ్వర్నీ భయపెట్టట్లే..స్వచ్ఛందంగా చేరుతున్నరు

ఎవ్వర్నీ భయపెట్టట్లే..స్వచ్ఛందంగా చేరుతున్నరు

కూసుమంచి, వెలుగు : బీఆర్ఎస్​లీడర్ల బెదిరింపులకు భయపడేది లేదని, కవ్వింపు చర్యలకు పాల్పడితే తిరగబడి తరిమి కొట్టేందుకు కాంగ్రెస్​ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని ఖమ్మం జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, మద్దినేని స్వర్ణకుమారి చెప్పారు. గురువారం కూసుమంచి మండల కేంద్రంలో వారు మీడియాతో మాట్లాడారు. కూసుమంచి సర్పంచ్​చెన్నా మోహన్​రావు అమ్ముడుపోయి, పార్టీ  మారారని సోషల్​ మీడియాలో ప్రచారం చేయడం కరెక్ట్​కాదన్నారు. తాము ఎవరినీ భయపెట్టడం లేదని, స్వచ్ఛందంగా వచ్చి కాంగ్రెస్​లో చేరుతున్నారని చెప్పారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పదికి పది సీట్లతోపాటు, రాష్ట్ర వ్యాప్తంగా మెజారీ సీట్లు కాంగ్రెస్​గెలవబోతుందని చెప్పారు. ఈ సందర్భంగా నాయకన్​గూడెం గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్​లో చేరారు. అలాగే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి కొడుకు హర్షారెడ్డి గురువారం కూసుమంచి మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. శ్రీనివాస్​రెడ్డికి ఓటు వేయాలని ప్రచారం చేశారు.