ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేస్తున్నా : కియారా అద్వానీ

ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేస్తున్నా : కియారా అద్వానీ

బాలీవుడ్​ నటి కియారా అద్వానీ ఇటీవల హీరో సిద్ధార్థ్​ మల్హోత్రాను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఆనాటి నుంచి కియారా ప్రెగ్నెన్సీపై సోషల్​ మీడియాలో ఎన్నో రూమర్స్​ పుట్టుకొచ్చాయి. ఇటీవల కొన్ని ఫొటోల్లో ఆమె బేబీ బంప్​తో కనిపించిందంటూ వార్తలు వచ్చాయి. తర్వాత అందులో నిజం లేదని తెలిసింది. తాజాగా నెట్టింట ఓ వీడియో వైరల్​గా మారింది. 2019లో ఓ సినిమా ప్రమోషన్​లో భాగంగా తనకు మాతృత్వాన్ని ఆస్వాదించాలని ఉందని కియారా తెలిపింది.

తన ప్రెగ్నెన్సీ టైంలో నచ్చిన ఫుడ్​ తిని హ్యాపీగా ఉంటానని చెప్పింది. బిడ్డ ఆరోగ్యంగా ఉంటే చాలు.. ఎలా ఉన్నా పరవాలేదంటూ తన మనసులోని కోరికను బయటపెట్టింది. దీంతో ఈ నటి ఎప్పుడెప్పుడు గుడ్​ న్యూస్​ చెప్తుందా అని ఫ్యాన్స్​ ఎదురుచూస్తున్నారు. కియారా మాత్రం కెరీర్​ చక్కదిద్దుకునే పనిలో బిజీగా ఉంది. ప్రస్తుతం రాంచరణ్​తో ‘గేమ్​ఛేంజర్​’లో నటిస్తోంది.