అన్నంలో నీళ్లు, మట్టి పడ్డాయ్

అన్నంలో నీళ్లు, మట్టి పడ్డాయ్

అమ్మానాన్న లేని సమయం చూసి దౌర్జన్యంగా తమ ఇంటిని కూల్చేశారని ఓ చిన్నారి ఆవేదన వ్యక్తం చేసింది. నగరంలోని గోపానపల్లివడ్డెరకాలనీలోపేదలఇళ్లనుప్రభుత్వ కూల్చివేయడంతో బాధితులు తమ బాధలను లీడర్లకు  చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే శనివారం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  గోపానపల్లి వడ్డెర కాలనీలో పర్యటించారు.  ఈ సందర్భంగా రేవంత్ ముందు ఓ చిన్నారి తమ బాధను చెప్పుకుంటూ ఏడ్చింది. ఇంట్లో ఎవ్వరులేని సమయంలో జేసీబీతో వచ్చి సామాన్లు అలాగే ఉన్నా తమ ఇంటిని కూల్చేశౄరని.. అన్నం తింటుండగా ప్లేట్లు లాక్కోని బయటకు తరిమారని కన్నీరుమన్నీరుగా విలపించింది. అన్నంలో నీళ్లు, మట్టి పడ్డాయని.. ఆ రోజంతా చలికి వణుకుతూ బయటే పడుకున్నామని తెలిపింది. దయచేసి ప్రభుత్వం తమను ఆదుకోవాలని ఎక్కి ఎక్కి ఏడ్చింది బాలిక.