అమెరికాలో కిమ్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ పేర్యా రవీందర్ రావుకు సన్మానం

అమెరికాలో కిమ్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ పేర్యా రవీందర్ రావుకు సన్మానం

కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్​లోని కిమ్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్​ పేర్యా రవీందర్  రావుకు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం డల్లాస్​లో ఘన స్వాగతం లభించింది. ఓల్డ్ స్టూడెంట్లు గుడి విష్ణువర్ధన్ రెడ్డి, వైఎస్ఆర్ సీపీ ఇన్​చార్జ్ లీడర్ రమణారెడ్డి ఆధ్వర్యంలో రవీందర్​ రెడ్డిని ఆహ్వానించి సన్మానించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రవాస  భారతీయులంతా కలిసిమెలిసి ఉండి అమెరికా అభివృద్ధితో పాటు పుట్టినిల్లు అయిన భారతదేశ అభివృద్ధికి సేవలందించాలని కోరారు. కార్యక్రమంలో ప్రవాస భారతీయులు  పాల్గొన్నారు.