నేడు హనుమకొండలో కిషన్​రెడ్డి, బండి సంజయ్ పర్యటన

 నేడు హనుమకొండలో కిషన్​రెడ్డి, బండి సంజయ్ పర్యటన

ప్రధాని మోదీ హన్మకొండ పర్యటన వేళ..   కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి, స్టేట్​ బీజేపీ చీఫ్​ బండి సంజయ్​ జూన్​2 న ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించనున్నారు.  మోదీ బహిరంగ సభకు హాజరుకానున్న నేపథ్యంలో సభా ఏర్పాట్లు, జన సమీకరణపై బీజేపీ స్టేట్​ చీఫ్ బండిసంజయ్, ముఖ్య నాయకులతో కలిసి చర్చించనున్నారు.  కాగా జూన్​1న పార్టీ నేతలతో కలిసి అయోధ్యనగర్​లోని పీవోహెచ్​వాగన్​మ్యానుఫాక్చరింగ్​ యూనిట్ ను కిషన్​రెడ్డి సందర్శించారు. 

వెయ్యి స్తంభాల గుడిలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. బీజేపీలో సీనియర్​లీడర్లు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మకాం వేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారు.