- ఏడేండ్లలో రూ.56 వేల కోట్లు
- పెట్రోల్, డీజిల్పై రాష్ట్రం వ్యాట్ వసూలు చేసిందన్న కిషన్రెడ్డి
హైదరాబాద్, వెలుగు : తెలంగాణ రాష్ట్ర సర్కార్ పెట్రోల్, డీజిల్పై అత్యధికంగా వ్యాట్ వసూలు చేస్తున్నదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. పెట్రోల్పై 35.20 శాతం, డీజిల్పై 27 శాతం వ్యాట్ వసూలు చేస్తుందని శనివారం ట్విట్టర్లో పేర్కొన్నారు. 2014 నుంచి 2021 వరకు ఈ ఏడేండ్లలో పెట్రోల్, డీజిల్పై రూ.56,020 కోట్లు పన్నుగా వసూలు చేసిందన్నారు.