ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించాలి: కిషన్ రెడ్డి

ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించాలి: కిషన్ రెడ్డి

హైదరాబాద్ లోని ఖైరతాబాద్ నియోజకవర్గం హిమాయత్ నగర్ లో కిషన్ రెడ్డి పాదయాత్ర నిర్వహించారు. డివిజన్ లోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.కాలనీల్లో నెలకొన్న సమస్యలను ప్రజలు కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి వివరించారు. దీనిపై స్పందించిన ఆయన వెంటనే సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 

పాదయాత్రలో భాగంగా శ్రీకాంతాచారి చిత్రపటానికి పులమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని తెలిపారు. కిషన్ రెడ్డి పాదయాత్రలో మున్సిపల్, వాటర్ వర్క్స్, ఎలక్ట్రిసిటీ లతో వివిధ డిపార్ట్ మెంట్లకు చెందిన అధికారులు పాల్గొన్నారు.