బషీర్ బాగ్,వెలుగు: ప్రభుత్వాలు చేసే తప్పులను ప్రశ్నించాలంటే.. ఓటు హక్కును కలిగి ఉండాలని కేంద్ర మంత్రి , బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశ పునర్నిర్మాణంలోనూ భాగస్వామ్యం కావాలంటే .. ఓటు వేయడం ప్రాథమిక బాధ్యత అని సూచించారు.
కేంద్ర ఎన్నికల సంఘం పిలుపు మేరకు ‘మేరా బూత్, సబ్సే మజ్బూత్’ ప్రోగ్రామ్ లో భాగంగా ఆదివారం అంబర్ పేట్ సెగ్మెంట్ కాచిగూడ భూమన్న గల్లీలోని పలు అపార్ట్ మెంట్లలో పోలింగ్ బూత్ లో ఓటర్ వెరిఫికేషన్ , ఎన్రోల్మెంట్ లో పాల్గొని ఓటర్ కార్డులో మార్పు చేర్పులపై స్థానికులకు అవగాహన కల్పించి మాట్లాడారు. ఓటరు లిస్టులో తప్పులు సరిదిద్దుకోవడంతో పాటు 18 ఏళ్లు పైబడిన వారు కొత్తగా ఓటు నమోదు చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు. ఓటు హక్కుపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు.