విపత్తు సాయంపై టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోంది

విపత్తు సాయంపై టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోంది

విపత్తు నిర్వహణ సాయం కింద తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదన్న టీఆర్ఎస్ ప్రచారాలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తిప్పికొట్టారు. గత ఎనిమిదేళ్లలో 3 వేల కోట్ల రూపాయలను కేంద్రం రిలీజ్ చేసినట్లు ఆధారాలను బయటపెట్టారు. 2018 నుంచి 1500 కోట్ల కంటే ఎక్కువే తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అందజేసినట్లు తెలిపారు. విపత్తు నిర్వహణ సహాయం కింద 2018 నుంచి తెలంగాణకు కేంద్రం ఏమీ ఇవ్వట్లేదన్నట్లు చెప్పి తప్పుదారి పట్టిస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు.