- కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం
- అధికార పార్టీకి మేలు చేసేందుకే కేసీఆర్ ప్రచారానికి రావట్లే
- బీసీ రిజర్వేషన్లను కాదు.. ముస్లిం రిజర్వేషన్లనే వ్యతిరేకిస్తున్నం
- హైదరాబాద్కు భారీగా నిధులు తెచ్చానని వ్యాఖ్య
హైదరాబాద్సిటీ, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపోటములపై వస్తున్న సర్వేల్లో నిజం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ‘‘జూబ్లీహిల్స్లో గెలుపోటములపై జరుగుతున్న సర్వేల్లో స్పష్టత లేదు. ఈ సర్వేలన్నీ నమ్మదగినవి కావు. ప్రజలే తుదితీర్పు ఇస్తారు. ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి విజయం ఖాయం” అని పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికను తాము ప్రతిష్టాత్మకంగా భావించడం లేదని, ఈ ఎన్నిక కేంద్రంలోని బీజేపీ పాలనకు రెఫరెండం కానే కాదని అన్నారు. ఈ నియోజకవర్గంలో పార్లమెంట్ఎన్నికల్లో బీజేపీకి భారీగా ఓట్లు పోలయ్యాయని, కానీ ఇప్పుడు ఉప ఎన్నికలో ఏ పార్టీకి ఓటు వేయాలన్న విషయంలో ఓటర్లకు ఇప్పటికీ స్పష్టత లేదని పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్ ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో కిషన్రెడ్డి మాట్లాడారు.
వ్యక్తిగత విమర్శలు చేయడంపైనే కాంగ్రెస్ దృష్టిపెడుతున్నదని కిషన్రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో ఆరు గ్యారంటీల గురించి గానీ, 400కు పైగా ఇచ్చిన హామీల గురించి గానీ ప్రస్తావించడం లేదని ఫైర్ అయ్యారు. ‘జూబ్లీహిల్స్లో డిపాజిట్తెచ్చుకోండి చాలు’ అంటూ సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘‘జూబ్లీహిల్స్లో రేవంత్రెడ్డి ఒక్కడే వచ్చి ఓటు వేయడు. ఎవరికి ఓటు వేయాలో ప్రజలకు తెలుసు” అని అన్నారు. ఈ నియోజకవర్గంలో ఓటింగ్పర్సంటేజీని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు.
బీఆర్ఎస్, బీజేపీ మధ్య పొత్తుండదు..
రేవంత్రెడ్డి సీఎంగా ఉండడం రాహుల్ గాంధీకి ఇష్టం లేదని కేటీఆర్చేసిన వ్యాఖ్యలను బట్టే కాంగ్రెస్, బీఆర్ఎస్మధ్య రహస్య ఒప్పందం ఉందన్నది స్పష్టమవుతున్నదని కిషన్రెడ్డి అన్నారు. ‘‘2019 ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్కలిసి పని చేశాయి. ఎప్పటికైనా బీఆర్ఎస్తమకు పనికొస్తుందనే రాహుల్భావిస్తున్నారు. అందుకే కాళేశ్వరంపై దర్యాప్తు చేయనివ్వలేదు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్కు మేలు చేసేందుకే కేసీఆర్ఒక్క గంట కూడా అక్కడికి ప్రచారానికి రాలేదు. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్ సహకరించుకుంటున్నాయి” అని ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఎలాంటి పొత్తు లేదని, భవిష్యత్తులో కూడా ఉండదని స్పష్టం చేశారు.
మజ్లిస్ కోసమే అజారుద్దీన్కు మంత్రి పదవి..
జూబ్లీహిల్స్ ప్రచారంలో సీఎం రేవంత్రెడ్డి లాగా తాను దిగజారి మాట్లడడం లేదని కిషన్ రెడ్డి అన్నారు. ‘‘కాంగ్రెస్లేకపోతే ముస్లింలు లేరని సీఎం రేవంత్రెడ్డి అనడం ఎంత వరకు కరెక్టు? అంటే వాళ్లకు హిందువులు లేకపోయినా ఫర్వాలేదా?. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్..మూడూ కుటుంబ పార్టీలే. పదేండ్లుగా బీఆర్ఎస్, రెండేండ్లుగా కాంగ్రెస్.. మజ్లిస్ను పెంచి పోషిస్తున్నాయి. ఆపార్టీ మెప్పు కోసమే అజారుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చారు. ఆయనను జూబ్లీహిల్స్లో ఎందుకు పోటీకి దింపలేదు?” అని ప్రశ్నించారు. ‘‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను మేం వ్యతిరేకించడం లేదు. కానీ అందులో 10 శాతం ముస్లింలకు ఇవ్వడన్నే వ్యతిరేకిస్తున్నం.
56 శాతం మంది బీసీలు ఉంటే, వాళ్లకు కాంగ్రెస్ఇస్తామంటున్నది 32 శాతమే. ఈ అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి” అని డిమాండ్ చేశారు. పాతబస్తీ అభివృద్ధికి ఇస్తున్న నిధులన్నీ ఎక్కడికి పోతున్నాయో? అందరికీ తెలుసునని.. అక్కడి ప్రజలు వాటర్, విద్యుత్, ఆస్తి పన్నులు ఏవీ కట్టరని.. ఒకవేళ కట్టాలనుకున్నా మజ్లిస్ నేతలు కట్టనివ్వరని వ్యాఖ్యానించారు.
హైదరాబాద్కు మస్తు నిధులు తెచ్చిన..
కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ అభివృద్ధికి ముఖ్యంగా హైదరాబాద్కుభారీగా నిధులు తెచ్చానని కిషన్రెడ్డి తెలిపారు. ‘‘తెలంగాణ అభివృద్ధిలో నా పాత్ర ఉంది. రాష్ట్ర ప్రాజెక్టుల కోసమే ఢిల్లీలోని నా కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశాను. రక్షణ సంస్థలకు రూ.1.40 లక్షల కోట్లు తెచ్చాను. ఎన్నో రీసెర్చ్సంస్థలను నగరానికి తీసుకొచ్చాను.
మహిళా స్కిల్సెంటర్, హైటెక్సిటీలో రవీంద్ర భారతి తరహాలో కల్చరల్సెంటర్, రూ.1,400 కోట్లతో ఔటర్రింగ్రైల్ ప్రాజెక్టు, రూ.420 కోట్లతో ఎంఎంటిఎస్ రెండోదశ యాదాద్రి వరకు చేపట్టేందుకు చర్యలు తీసుకున్నాం. మెట్రోరైలుకు రూ.1,450 కోట్లు మంజూరు చేశాం. ఎయిమ్స్కు రూ.1,360 కోట్లు, కంటోన్మెంట్ అభివృద్ధికి రూ.300 కోట్లు, హైవేల నిర్మాణానికి రూ.1.20 కోట్లు కేటాయించాం. సిటీలోని అన్ని రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నాం.
నగరం నుంచి 5 వందే భారత్రైళ్లను నడుపుతున్నాం. రూ.1,030 కోట్లతో అంబర్పేట ఫ్లైఓవర్, ఉప్పల్ఫ్లైఓవర్ నిర్మిస్తున్నాం” అని వివరించారు. కాంగ్రెస్ మాత్రం సకల సమస్యలకు ఫ్రీ బస్ఒక్క దాన్ని పరిష్కారంగా చూపుతున్నదని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్క్లబ్అధ్యక్షుడు విజయ్కుమార్రెడ్డి, ఉపాధ్యక్షురాలు అరుణ, ప్రధాన కార్యదర్శి రమేశ్, జాయింట్ సెక్రటరీలు హరిప్రసాద్, బాపూరావు పాల్గొన్నారు.
