రాష్ట్రంలో తండ్రీ కొడుకుల ఆటలు సాగవు

రాష్ట్రంలో తండ్రీ కొడుకుల ఆటలు సాగవు

సీఎం కేసీఆర్ కొడుకు కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేయాలని తహతహలాడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్లో ఉన్నది తెలంగాణ ద్రోహులని మండిపడ్డారు. రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన మజ్లిస్తో దోస్తీ చేస్తున్న కేసీఆర్.. మోడీ సర్కారుపై విష ప్రచారం చేయిస్తున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో నియంతృత్వ పాలన కొనసాగుతోందన్న కిషన్ రెడ్డి.. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రగతి భవన్ను తెలంగాణ ప్రజా భవన్గా మారుస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ కోసం జరిగిన ఆత్మ బలిదానాలన్నీ కేసీఆర్ కుటుంబం కోసం చేసినట్లుగా మారిందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రజలు ఎంతో చైతన్యవంతులన్న ఆయన.. రాష్ట్రంలో ఇకపై తండ్రీ కొడుకుల ఆటలు సాగవని హెచ్చరించారు. కమలం పార్టీ పాలమూరుకు ఎంతో రుణపడి ఉందన్న కిషన్ రెడ్డి..వచ్చే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.