తెలంగాణలో కూడా అదే కాబోతుంది

తెలంగాణలో కూడా అదే కాబోతుంది

ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా బీజేపీని ఆపలేరని కేంద్రమంత్రి కిషన్ రెడ్డ్ అన్నారు. ఈ నెల మూడవ తేదిన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో బీజేపీ భారీ బహిరంగ సభ జరుగనుంది. ఈ సభ ఏర్పాట్లను రాష్ట్ర బీజేపీ నేతలు పరిశీలించారు. ఈ కార్యక్రమలంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, బీజేపీ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకట్ స్వామి పాల్గొన్నారు.

అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మరో రెండు రోజుల్లో హైదరాబాద్ లో జరుగబోతున్నాయి. ఈ సభల కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. బీజేపీ సభల ప్రాముఖ్యతను తగ్గించాలని అన్ని విధాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందిని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలను, బీజేపీ గెలుపును ఎవరు ఆపలేరని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మీ పతనం ప్రారంభమైందని టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలపై కిషన్ రెడ్డి మండిపడ్డారు.