
నార్తాంప్టన్: ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ ముందు టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (51) మరోసారి మెరిశాడు. ఇంగ్లండ్ లయన్స్తో రెండో అనధికార టెస్టులో తొలి ఇన్నింగ్స్లో సెంచరీతో సత్తా చాటిన అతను రెండో ఇన్నింగ్స్లో ఫిఫ్టీతో మెప్పించాడు. కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ (80) కూడా సత్తా చాటడంతో మూడో రోజు, ఆదివారం చివరకు ఇండియా రెండో ఇన్నింగ్స్లో 163/4 స్కోరుతో నిలిచింది.
ఓపెనర్ యశస్వి జైస్వాల్ (5) మరోసారి ఫెయిలైనా.. రెండో వికెట్కు రాహుల్, ఈశ్వరన్ 88 రన్స్ జోడించారు. కరుణ్ నాయర్ (15) కూడా నిరాశ పరచాడు. నాయర్ వికెట్ తీసిన క్రిస్ వోక్స్ సెంచరీ చేసేలా కనిపించిన ఈశ్వరన్ను కూడా ఔట్ చేశాడు. ప్రస్తుతం ధ్రువ్ జురెల్ (6 బ్యాటింగ్), నితీష్ రెడ్డి (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 319/7తో ఆట కొనసాగించిన లయన్స్ తొలి ఇన్నింగ్స్లో 348 రన్స్కు ఆలౌటైంది. దాంతో ఇండియాకు 21 రన్స్ స్వల్ప ఆధిక్యం లభించింది. ఖలీల్ అహ్మద్ నాలుగు, అన్షుల్ కాంబోజ్, తుషార్ దేశ్పాండే చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం ఇండియా ఓవరాల్గా184 రన్స్ ఆధిక్యంలో ఉంది.