స్క్రాప్ బ్యాచ్ మహానాడు సభ పెట్టుకున్నారు : కొడాలి నాని

స్క్రాప్ బ్యాచ్ మహానాడు సభ పెట్టుకున్నారు : కొడాలి నాని

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు , టీడీపీ నేతలపై గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని విమర్శలు గుప్పించారు. స్క్రాప్ బ్యాచ్ అంతా రాజమండ్రిలో మహానాడు సభ పెట్టుకున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ పేరుతో, ప్రజలకు వెన్నుపోటు పొడిచేందుకు చంద్రబాబు సిద్ధమయ్యాడని, ఎన్టీఆర్ ఉంటే పార్టీ, రాష్ట్రం నాశనం అవుతుందన్న చంద్రబాబు, గతిలేక, రాజకీయంగా బతకడానికి తిరిగి ఎన్టీఆర్ పేరు వాడుకుంటున్నాడని నాని వ్యాఖ్యానించారు.చంద్రబాబు, లోకేష్ ను తన్ని తరిమి కొట్టి ఎన్టీఆర్ వారసులు తెలుగుదేశం పార్టీని స్వాధీనం చేసుకుంటారని జోస్యం చెప్పారు.. 

మీకు దమ్ముంటే గన్నవరం, గుడివాడలో పోటీ చేయండి

చంద్రబాబు, లోకేష్‌కు  దమ్ముంటే గుడివాడ, గన్నవరంలో పోటీ చేయాలని కొడాలి నాని సవాల్ చేశారు.  రాజకీయాలంటే బట్టల వ్యాపారమా? ఆకర్షణీయమైన మేనిఫెస్టో పెట్టడానికి అంటూ సెటైర్లు వేశారు.. చంద్రబాబుకు 2024 ఎన్నికల్లో ఎదురు దెబ్బ తప్పదని, చంద్రబాబు ఆకర్షణీయమైన అబద్ధాలు, వెన్నుపోట్లు ప్రజలందరికీ తెలుసన్నారు.   దేశమంతా తిరిగిన చంద్రబాబు లాంటి నీచ రాజకీయ నాయకుడు మరొకరు ఉండరంటూ మండిపడ్డారు మాజీ మంత్రి కొడాలి నాని.ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ మంత్రి కొడాలి నాని నివాళులర్పించారు