
హైదరాబాద్, వెలుగు: ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్ గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా ఎన్నికైనట్టు రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఇద్దరు ఆరేండ్ల పాటు పదవిలో కొనసాగుతారని అందులో పేర్కొంది. కాగా, సెక్రటేరియెట్లో సీఎం రేవంత్రెడ్డిని కోదండరాం, అమీర్ అలీఖాన్ మర్యాదపూర్వకంగా కలిశారు.