కాంగ్రెస్‌‌ పార్టీతో కోదండరాం చర్చలు

కాంగ్రెస్‌‌ పార్టీతో కోదండరాం చర్చలు

హైదరాబాద్, వెలుగు:  కాంగ్రెస్‌‌తో పొత్తు కోసం తెలంగాణ జన సమితి (టీజేఎస్) ప్రయత్నాలు చేస్తున్నది. ఇందులో భాగంగా ఇటీవల ఢిల్లీలో ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లిఖార్జున ఖర్గేతో కోదండరాం సమావేశమైనట్లు టీజేఎస్ నేతలు చెబుతున్నారు. పొత్తుపై చర్చలు జరిపినట్లు వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘వెలుగు’ ప్రతినిధితో టీజేఎస్ చీఫ్ కోదండరాం మాట్లాడుతూ.. 9 ఏండ్ల నుంచి ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదని, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదని, దళితులపై దాడులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఎన్నికల హామీలను అమలు చేయలేదని ఆరోపించారు. సామాజిక తెలంగాణే లక్ష్యంగా, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు కాంగ్రెస్‌‌తో పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ నేతలు అంగీకరిస్తారనే నమ్మకం తనకు ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే కాంగ్రెస్‌‌ పార్టీలో తమ పార్టీని విలీనం చేయబోమని, దీనిపై వస్తున్న వార్తలన్నీ అవాస్తమని స్పష్టం చేశారు.