
శ్రీరామ్, శ్రుతీ మీనన్ జంటగా చంద్రశేఖర్ కానూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘కోడి బుర్ర’. వీ4 క్రియేషన్స్ బ్యానర్పై కంచర్ల సత్యనారాయణరెడ్డి, గట్టు విజయ్ గౌడ్, చిన్ని చందు, వట్టం రాఘవేంద్ర, సముద్రాల మహేశ్ గౌడ్ నిర్మిస్తున్నారు. సోమవారం ఫిలిం నగర్ టెంపుల్లో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి కెమెరా స్విచాన్ చేయగా, నిర్మాత బెక్కెం వేణుగోపాల్ క్లాప్ కొట్టారు. దర్శకుడు భరత్ కమ్మ టీమ్కు స్క్రిప్ట్ అందజేశారు. అందరికీ నచ్చే కంటెంట్తో ఈ క్రైమ్ థ్రిల్లర్ ఉండబోతోందని హీరో శ్రీరామ్ చెప్పాడు. ఇందులో శ్రీరామ్ పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నాడని, ఈనెల 22 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నట్టు దర్శకనిర్మాతలు తెలియజేశారు. ఆరుషి, మహావీర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.