పూడూరు జీపీలో .. ఫేక్ బిల్ బుక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో లక్షల రూపాయలు గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

పూడూరు జీపీలో .. ఫేక్ బిల్ బుక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో లక్షల రూపాయలు గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

కొడిమ్యాల, వెలుగు: కొడిమ్యాల మండలం పూడూరు జీపీలో ఫేక్ బిల్ బుక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో లక్షల రూపాయలు గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జరిగింది. గుర్తించిన జీపీ కార్యదర్శి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది. కారోబార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మధు దొంగ బిల్ బుక్స్ ప్రింట్ చేసి గ్రామంలో డబ్బులు వసూలు చేశాడు. కొద్దిరోజుల కింద ఓ ఇంటి మార్పిడి విషయంలో ఒకరితో ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.3వేలు కట్టించి, దొంగ రసీదు ద్వారా మరో రూ.3వేలు వసూలు చేశాడు.

 దీన్ని గుర్తించిన ఇంటి యజమాని వారం కింద కార్యదర్శి జ్యోతి దృష్టికి తీసుకెళ్లాడు. ఆమె విచారణ చేయగా 5 దొంగ బిల్ బుక్స్ ఉన్నట్లు గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చింది. ఈ విషయమై ఎంపీవో వెంకటేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వివరణ కోరగా దొంగ బిల్ బుక్స్ గుర్తించింది నిజమేనని, జిల్లాస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లి పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.