కోహ్లీ ఎక్కడైనా కింగే..

కోహ్లీ ఎక్కడైనా కింగే..

భారత జట్టు మాజీ సారథి విరాట్ కోహ్లీ.. అటు ఆటలోనూ.. ఇటు సోషల్ మీడియాలోనూ రికార్డులు తిరగరాస్తున్నాడు. తాజాగా అతను మరో అరుదైన ఘనత సాధించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో 200మిలియన్ల మంది ఫాలోవర్లను చేరుకున్న తొలి ఇండియన్గా కోహ్లీ నిలిచాడు. అంతేకాదు..వరల్డ్లోనే అత్యధిక ఫాలోవర్లు ఉన్న క్రికెటర్గానూ కోహ్లీ పేరు దక్కించుకున్నాడు. 2019 మేలో ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లీని 33.5 మిలియన్ల మంది ఫాలో అయ్యేవారు. అయితే కేవలం మూడేళ్లలో ఈ సంఖ్య లక్షా 67 మిలియన్లకు పెరగడం విశేషం. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Virat Kohli (@virat.kohli)

ఇన్స్టా రికార్డుపై స్పందించిన కోహ్లీ..భారీ మద్దతుపై అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ఇక 33 ఏళ్ల కోహ్లీ ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్లు ఉన్న మూడో క్రీడాకారుడు. ఇతని కంటే ముందు 450 మిలియన్ల ఫాలోవర్లతో ఫుట్బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో మొదటి స్థానంలో ఉండగా..333 మంది ఫాలోవర్లతో అర్జెంటీనా ఫుట్బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.