బీఆర్ఎస్​ను జనం నమ్మడం లేదు  :  కొలను హనుమంతరెడ్డి

బీఆర్ఎస్​ను జనం నమ్మడం లేదు  :  కొలను హనుమంతరెడ్డి

జీడిమెట్ల, వెలుగు: అన్నివర్గాల ప్రజలను బీఆర్ఎస్ ​మోసం చేసిందని కుత్బుల్లాపూర్​సెగ్మెంట్ కాంగ్రెస్​ అభ్యర్థి కొలను హనుమంతరెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం వెంకటేశ్వర్​నగర్​ నుంచి యువతతో కలిసి పెద్ద ఎత్తున బైక్​లతో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ రెండుసార్లు గెలిచి  జనాలను మోసం చేసిందన్నారు. మళ్లీ కల్లబొల్లి వాగ్ధానాలు చెబితే  ఈసారి జనం నమ్మే స్థితిలో లేరన్నారు.

ఇచ్చిన హామీలు, మాట నిలబెట్టుకునే సత్తా కేవలం కాంగ్రెస్​ పార్టీకే ఉందన్నారు. తెలంగాణాలో అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేసి అన్నివర్గాల ప్రజలకు అండగా ఉంటామన్నారు. ఇందుకు హస్తం గుర్తుకు ఓటేసి కాంగ్రెస్​ను గెలిపించాలని కోరారు.  బాచుపల్లిలో కొలను హనుమంతరెడ్డి సతీమణి నీరజారెడ్డి ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్​కు ఓటేయాలని కోరారు.