చస్తానంటూ బ్రిడ్జి ఎక్కాడు.. బిర్యానీ ఆఫర్ చేయగానే దిగొచ్చాడు

చస్తానంటూ బ్రిడ్జి ఎక్కాడు.. బిర్యానీ ఆఫర్ చేయగానే దిగొచ్చాడు

కోల్ కతాలో విచిత్రమైన ఘటన జరిగింది. జీవితం మీద విరక్తితో  ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు.  కూతురితో  కలిసి బయటకు  వెళ్లిన అతను సడెన్ గా రోడ్డుపైన ఉన్న బ్రిడ్జి ఎక్కి  దూకేందుకు ఆత్మహత్యకు యత్నించాడు. అయితే  ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు అతడిని ఆపేందుకు ప్రయత్నించారు. ఎలాగైనా అతడిని  బ్రిడ్జి నుంచి కిందకు దించాలనుకున్న పోలీసులు అతడికి  బిర్యానీ ఆఫర్ చేశారు. బిర్యానీ ఇప్పిస్తానని చెప్పగానే అతడు బ్రిడ్జి నుంచి కిందకు వచ్చాడు.  ఈ వీడియో ఇపుడు వైరల్ గా మారింది.

అసలేం జరిగిందంటే.. టైల్స్  వ్యాపారంలో నష్టపోవడంతో పాటు అతను ఇటీవల తన భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు . అలాగే తన చిన్న కూతురు కూడా తనను విడిచిపెట్టి వెళ్లిపోయింది.  ఆర్థిక కష్టాలు రావడంతో అతను పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లాడు.  దీంతో జనవరి 22న  మధ్యాహ్నం  తన పెద్ద కుమార్తెతో కలిసి అతను సైన్స్ సిటీకి బయల్దేరాడు. పార్క్ సర్కస్ లో ఉన్న బ్రిడ్జి దగ్గరకు రాగానే  బైక్ ఆపి తన మొబైల్ పడిపోయిందని వెతుకున్నానని కూతురికి చెప్పాడు.  కూతురిని రోడ్డుపై నిలబెట్టి  అతను  బ్రిడ్జి ఎక్కి కిందకు దూకుతానంటూ బెదిరించాడు.  

ఘటనా స్థలానికి వచ్చిన  పోలీసులు అతడితో మాట్లాడేందుకు ప్రయత్నించారు. అతని కుమార్తెతో మాట్లాడి అతని కిందకు రప్పించేందకు ప్లాన్ వేశారు పోలీసులు.  అతడికి  కోల్ కతాలోని ప్రముఖ హోటల్ నుంచి బిర్యానీ,అలాగే జామ్  ఇస్తామని ఆఫర్ చేశారు.  బిర్యానీ ఆఫర్ తో  అతను ఆత్మహత్యాయత్నాన్ని విరమించుకుని  కిందకు దిగేందుకు ఒప్పుకున్నాడు. అతను  బ్రిడ్జిపై నుంచి కిందకు దిగుతుండగా పడిపోయే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.  ఈ డ్రామాతో దాదాపు 20 నిముషాల పాటు రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.