టీఆర్ఎస్ పాలనలో ప్రజల బతుకులు ఏం మారలేదు : రాజగోపాల్ రెడ్డి

టీఆర్ఎస్ పాలనలో ప్రజల బతుకులు ఏం మారలేదు : రాజగోపాల్ రెడ్డి

టీఆర్ఎస్ 8ఏళ్ల పాలనలో ప్రజల బతుకులు ఏమీ మారలేదని మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఎంపీ అర్వింద్ తో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ కుటుంబం కాంట్రాక్టుల పేరుతో లక్షల కోట్లు దోచుకుంటోందని విమర్శించారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం షాపులు పెట్టి ప్రజలను ఆగం చేస్తున్నారని మండిపడ్డారు. సిద్ధిపేట, సిరిసిల్ల, గజ్వేల్ లెక్క.. మిగితా నియోజకవర్గాలను ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. 

అంగట్లో గొర్రెలను కొన్నట్టు 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ కొన్నారని రాజగోపాల్ రెడ్డి అన్నారు. కేసీఆర్ను గద్దె దించాల్సిన సమయం వచ్చిందని.. ప్రజల కోసం పదవీ త్యాగం కాదు.. ప్రాణ త్యాగమైనా చేస్తానని అన్నారు.  టీఆర్ఎస్ ప్రలోభాలకు ప్రజలు లొంగొద్దని.. టీఆర్ఎస్ డబ్బులు తీసుకుని బీజేపీకి ఓటేయాలన్నారు. తనను ఓడించడానికి కౌరవుల సేన వచ్చిందని.. ప్రజలు వారికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.