రాహుల్ సభకు రాజగోపాల్ రెడ్డి డుమ్మా

రాహుల్ సభకు రాజగోపాల్ రెడ్డి డుమ్మా

హైదరాబాద్, వెలుగు: వరంగల్​సభకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ​గోపాల్​రెడ్డి గైర్హాజరయ్యారు. కొంతకాలంగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉం టున్న రాజగోపాల్​రెడ్డి.. రాహుల్ సభకు వస్తారని భావించినా.. ఆయన రాహుల్​ టూర్​కు దూరంగా ఉన్నారు. ఆయన సోదరుడు వెంకట్​రెడ్డి మాత్రం వరంగల్​ సభలో ఉత్సాహంగా పాల్గొన్నారు. రాహుల్​ రైతు కుటుంబాల్ని పరామర్శించే సమయంలోనూ కొందరిని పరిచయం చేసే ప్రయత్నం చేశారు. రాహుల్​ స్పీచ్​ తర్వాత సభలో మాట్లాడేందుకు వెంకట్​రెడ్డికే అవకాశం రావడం గమనార్హం.