ఇప్పటికే డీజిల్, పెట్రోల్ రేట్లు పెరగటంతో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటాయని అన్నారు కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. పెరిగిన ధరలతో పేద, మధ్య తరగతి ప్రజలు అయోమయంలో ఉన్నారని.. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఇప్పుడు ఆర్టీసి ధరలు పెంచి ప్రజలకు రవాణా భారాన్ని కూడా పెంచాలని చూస్తుందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఆర్టీసీ టికెట్ల పెంపు నిర్ణయం మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టుగా ఉందంటూ ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. వెంటనే ఆర్టీసీ టికెట్ల పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ట్వీట్ చేశారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.
ఇప్పటికే డీజిల్, పెట్రోల్ రేట్లు పెరగటం వల్ల నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటాయి దాంతో పేద, మధ్య తరగతి ప్రజలు అయోమయంలో ఉన్నారు ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రజలని ఆదుకోవాల్సిన ప్రభుత్వం @TelanganaCMO ఆర్టీసి ధరలు పెంచి ప్రజలకు రవాణా భారాన్ని కూడా పెంచాలని చూస్తుంది.
— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) December 1, 2021