
హనుమకొండ సిటీ, వెలుగు: అన్యాయాన్ని ఎదిరించినప్పుడే న్యాయం జరుగుతుందని మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. యువత అన్యాయం, అక్రమాలను ప్రశ్నించడం నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. కొండా మురళి జీవిత చరిత్ర ఆధారంగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘కొండా’ సినిమా ప్రీ రిలీజ్ఈవెంట్ను హనుమకొండ హంటర్ రోడ్డులోని విష్ణుప్రియా గార్డెన్స్లో శనివారం సాయంత్రం గ్రాండ్గా నిర్వహించారు. మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళితోపాటు నిర్మాత సుష్మిత పటేల్, డా.అభిలాష్, శ్రేష్ఠ పటేల్, హీరో త్రిగుణ్, హీరోయిన్ఈరా మోర్, జబర్దస్త్ ఫేమ్ రామ్ప్రసాద్ హాజరయ్యారు. ఈవెంట్ యాంకర్గా సుమ వ్యవహరించారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ ప్రశ్నించే గొంతును నొక్కేస్తున్నారని, ఈవెంట్కు టీపీసీసీ చీఫ్రేవంత్రెడ్డి హాజరు కాకుండా కుట్రలు చేశారన్నారు. ప్రభుత్వం దౌర్జన్యాలు, అణచివేతకు పాల్పడుతోందన్నారు. ఉద్యమించి రాష్ట్రాన్ని తెచ్చుకున్నట్టే అక్రమాలు, అన్యాయాలపై పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. నిర్మాత కొండా సుష్మిత పటేల్ మాట్లాడుతూ అణచివేత ఎట్లుంటదో ‘కొండా’ సినిమాలో కనిపిస్తుందని చెప్పారు. కొండా మురళి మాట్లాడుతూ సమాజంలో ఎలా ఉండాలో ఆర్కే నేర్పించాడని, ప్రతి ఒక్కరూ సమాజం గురించి కొంత సమయమైనా ఆలోచించాలన్నారు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ భూస్వాములు, పెత్తందారుల అణచివేతకు గురైన కొండా మురళి నిజజీవితమే మూవీలో చూపించామన్నారు. సినిమాను అందరూ ఆదరించాలని కోరారు.