హనుమకొండ సిటీ, వెలుగు: అన్యాయాన్ని ఎదిరించినప్పుడే న్యాయం జరుగుతుందని మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. యువత అన్యాయం, అక్రమాలను ప్రశ్నించడం నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. కొండా మురళి జీవిత చరిత్ర ఆధారంగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘కొండా’ సినిమా ప్రీ రిలీజ్ఈవెంట్ను హనుమకొండ హంటర్ రోడ్డులోని విష్ణుప్రియా గార్డెన్స్లో శనివారం సాయంత్రం గ్రాండ్గా నిర్వహించారు. మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళితోపాటు నిర్మాత సుష్మిత పటేల్, డా.అభిలాష్, శ్రేష్ఠ పటేల్, హీరో త్రిగుణ్, హీరోయిన్ఈరా మోర్, జబర్దస్త్ ఫేమ్ రామ్ప్రసాద్ హాజరయ్యారు. ఈవెంట్ యాంకర్గా సుమ వ్యవహరించారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ ప్రశ్నించే గొంతును నొక్కేస్తున్నారని, ఈవెంట్కు టీపీసీసీ చీఫ్రేవంత్రెడ్డి హాజరు కాకుండా కుట్రలు చేశారన్నారు. ప్రభుత్వం దౌర్జన్యాలు, అణచివేతకు పాల్పడుతోందన్నారు. ఉద్యమించి రాష్ట్రాన్ని తెచ్చుకున్నట్టే అక్రమాలు, అన్యాయాలపై పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. నిర్మాత కొండా సుష్మిత పటేల్ మాట్లాడుతూ అణచివేత ఎట్లుంటదో ‘కొండా’ సినిమాలో కనిపిస్తుందని చెప్పారు. కొండా మురళి మాట్లాడుతూ సమాజంలో ఎలా ఉండాలో ఆర్కే నేర్పించాడని, ప్రతి ఒక్కరూ సమాజం గురించి కొంత సమయమైనా ఆలోచించాలన్నారు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ భూస్వాములు, పెత్తందారుల అణచివేతకు గురైన కొండా మురళి నిజజీవితమే మూవీలో చూపించామన్నారు. సినిమాను అందరూ ఆదరించాలని కోరారు.
అన్యాయాన్ని ఎదిరిస్తేనే న్యాయం జరుగుతుంది
- తెలంగాణం
- June 19, 2022
లేటెస్ట్
- మే 1 నుంచి పోలింగ్ డ్యూటీపై శిక్షణ
- మా వడ్లు మాకివ్వండి..!
- ఏటూరునాగారం ఏజెన్సీలో ఈదురు గాలులతో భారీ వర్షం
- తొర్రూరులో కేసీఆర్కు ఘన స్వాగతం
- జమ్మూ కశ్మీర్ భారీ వర్షాలు.. కొండ చరియలు విరిగి ఇండ్లు ధ్వంసం
- పోలీస్ కుటుంబాలకు అండగా ఉంటాం : బి.రోహిత్ రాజు
- సారా బట్టీలపై ఎక్సైజ్పోలీసుల దాడులు
- Chandini Chowdary: అయ్యో.. నేను ఆలా అనలేదు.. చాందిని చౌదరిని ఆడేసుకుంటున్న నెటిజన్స్
- బోడియాతండాలో మిషన్ భగీరధ నీరు వృథా
- నల్గొండ ఎన్నికల బరిలో 22 మంది అభ్యర్థులు
Most Read News
- Gold rates : తగ్గిన బంగారం ధరలు .. ఇప్పుడు తులం ఎంతంటే ?
- ఆర్టీసీ కండక్టర్పై మహిళా ప్రయాణికురాలు దాడి
- ఉద్యోగులకు షాకిచ్చిన గూగుల్: పైథాన్ టీం మొత్తాన్ని లేపేసింది
- మూఢమి వచ్చేసింది బాబోయ్... మూడు నెలలు ముహూర్తాలకు సెలవులు..
- రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
- IPL 2024: చోకర్స్ ఆఫ్ ఐపిఎల్ 2024: సన్రైజర్స్ ఫ్రాంచైజీని దూషించిన మాజీ దిగ్గజం
- T20 World Cup 2024: కోహ్లీ, శాంసన్ ఔట్.. భారత జట్టు ఎంపిక పట్ల ఫేక్ ప్రచారం
- Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. వేదికలు ఖరారు చేసిన పాక్ క్రికెట్ బోర్డు
- వ్యక్తిగత విమర్శలు ఆపండి.. అతను దేవుడితో సమానం: నవజ్యోత్ సింగ్ సిద్ధూ
- OLA విలవిల.. సీఈఓ రాజీనామా.. 10 శాతం మంది ఉద్యోగులు తొలగింపు!