
కొండగట్టు, వెలుగు: కొండగట్టు పుణ్యక్షేత్రంలో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నట్లు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. బుధవారం డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజబుల్ టీమ్లతో తనిఖీలు చేపట్టారు. ఆలయంలోని ప్రధాన ద్వారం మండపాలు పార్కింగ్, వసతి గృహాలను తనిఖీ చేసినట్లు తెలిపారు.