కాంగ్రెస్ వస్తే కరెంటు గోస తప్పదు: కొప్పుల మహేశ్​రెడ్డి 

కాంగ్రెస్ వస్తే కరెంటు గోస తప్పదు: కొప్పుల మహేశ్​రెడ్డి 

గండీడ్, వెలుగు : కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తే కరెంటు గోస తప్పదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్​రెడ్డి అన్నారు. గురువారం మహ్మదాబాద్ మండలంలోని దేశాయిపల్లి గేట్​వద్ద పల్లవి ఫంక్షన్ హాల్​లో గురువారం దేశాయ్ పల్లి, చౌదరి పల్లి, నంచర్ల, షేక్ పల్లికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు 1‌‌‌‌‌‌‌‌00 మంది ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బీఆర్​ఎస్​లో చేరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకుల మోసపూరిత మాటలు నమ్మొద్దని ప్రజలకు సూచించారు. మళ్లీ బీఆర్​ఎస్​దే అధికారం అని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ గండీడ్, మహ్మదాబాద్ మండలాల అధ్యక్షులు పెంట్య నాయక్, భిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.