
కోరుట్ల,వెలుగు: కోరుట్ల లోని జడ్పీ గర్ల్స్ హైస్కూల్లో గురువారం రక్షా బంధన్ నిర్వహించారు. స్టూడెంట్స్ స్వయంగా తయారు చేసిన రాఖీలను ప్రధాని మోదీకి పోస్టులో పంపించారు. ఆపరేషన్ సిందూర్ సక్సెస్, సైన్యం ధైర్య సాహాసాలకు అభినందనగా రాఖీలు పంపినట్లు స్టూడెంట్స్ తెలిపారు.
ఆకాశ్, బ్రహ్మోస్, రాఫెల్, ఎస్400 చిత్రాలను రాఖీలో ప్రదర్శించారు. కోరుట్ల ప్రజాపిత బ్రహ్మా కుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో కోరుట్ల కోర్టులో బార్ అసోసియేషన్ లాయర్లకు బ్రహ్మాకుమారీస్ రాజేశ్వరి, గీతలు రాఖీ కట్టి, పండగ ప్రాముఖ్యతను వివరించారు.