తలనొప్పి వస్తే కడుపు నొప్పి ట్యాబ్లెట్వేసుకుంటే ఎలా ఉంటుంది? ఓ చోట ఇలానే చేసి నవ్వులపాలయ్యారు అధికారులు. రాజస్థాన్లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. వీరిలో ఫ్యాన్లకి ఉరేసుకుని చనిపోయే వారే ఎక్కువగా ఉంటున్నారు.
సూసైడ్లను అరికట్టడానికి అధికారుల బ్రెయిన్కి మాగొప్ప ఐడియా తట్టింది. అనుకున్నదే లేటు.. హాస్టళ్లలో స్ర్పింగ్లతో కూడిన ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. ఎవరైనా సూసైడ్ చేసుకోవాలని చూసిన వారి బరువుకు ఫ్యాన్ ఊడి కిందకి వస్తుంది. ఏముంది ఆత్మహత్యలు ఆపినట్లే కదా అని వారి సమాధానం.
దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు..
ఆత్మహత్యలు జరగకుండా స్ప్రింగ్ఫ్యాన్లు ఏర్పాటు చేయడంపై రాజస్థాన్ ఆఫీసర్లపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూసైడ్లు జరగకుండా కౌన్సిలింగ్ఇచ్చి ఆపాల్సింది పోయి స్ప్రింగ్లు బిగించడమేంటని ప్రశ్నిస్తున్నారు.
వేరే విధంగా చనిపోతే దానికి కూడా ఇలాంటి పనికి మాలిన ఐడియాతో పరిష్కారం చూపుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తమకు నచ్చిన రీతిలో కామెంట్లు చేస్తున్నారు. ఆఫీసర్ల నిర్ణయంపై మీరేమనుకుంటున్నారు మరి.