భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: బొగ్గు ఉత్పత్తిలో ఫ్రంట్లైన్ సూపర్ వైజర్స్దే కీలక పాత్ర అని కొత్తగూడెం ఏరియా జీఎం షాలెం రాజు పేర్కొన్నారు. కొత్తగూడెంలోని ఎంవీటీసీలో ఏర్పాటు చేసిన ఫ్రంట్ లైన్ సూపర్ వైజర్స్ ట్రైనింగ్ ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తికి ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. బొగ్గు ఉత్పత్తిలో ఫ్రంట్లైన్ సూపర్వైజర్స్ కృషి మరువలేనిదన్నారు. యాక్సిడెంట్లు లేకుండా రక్షణ సూత్రాలను పాటించాలన్నారు. ఈ ప్రోగ్రాంలో ఎస్వోటూ జీఎం కోటిరెడ్డి, ఏఐటీయూసీ వైస్ ప్రెసిడెంట్ కె. రాములు, ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఎండీ రజాక్, డీజీఎం జీవీ మోహన్రావు, ఏరియా ఇన్చార్జి ఇంజనీర్ లక్ష్మణమూర్తి, ఎంవీటీసీ మేనేజర్లక్ష్మణ్ పాల్గొన్నారు.
