ట్యాంక్ బండ్ బుద్ధుడి విగ్రహం వద్ద కొత్త మనోహర్ రెడ్డి దీక్ష

ట్యాంక్ బండ్ బుద్ధుడి విగ్రహం వద్ద కొత్త మనోహర్ రెడ్డి దీక్ష

హైదరాబాద్ : ట్యాంక్ బండ్ లుంబిని పార్క్ లో కాంగ్రెస్ బహిష్కృత నేత కొత్త మనోహర్ రెడ్డి ఆందోళన చేపట్టారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపణలు చేయడంతో కాంగ్రెస్ పార్టీ నుండి ఇటీవల సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.  తన సస్పెన్షన్ కు నిరసనగా ట్యాంక్ బండ్ బుద్ధుడి విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు కొత్త మనోహర్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్న కార్యకర్తలకు, లీడర్లకు న్యాయం జరగాలంటే రేవంత్ రెడ్డిను పీసీసీ చీఫ్ పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. 

ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్న లీడర్లను రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్నారని ఆరోపించారు. టికెట్లను కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి అవినీతిని ప్రశ్నించినందుకే తనకు ఎలాంటి షోకాజ్ నోటీసులు ఇవ్వకుండానే పార్టీ నుంచి సస్పెండ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ పదవి నుండి తొలిగించాలని బుద్ధుడి విగ్రహం వద్ద దీక్ష చేపట్టారు కొత్త మనోహర్ రెడ్డి.