- మీటింగ్ మినిట్స్ రిలీజ్ చేసిన కృష్ణా బోర్డు
- సాగర్పై సీఆర్పీఎఫ్ బలగాల పహారా కొనసాగుతుందని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: నాగార్జున సాగర్ప్రాజెక్టు ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్, రిపేర్లు, పర్యవేక్షణ సహా ఏ పనులు చేపట్టాలన్న కేఆర్ఎంబీ పర్మిషన్ తీసుకోవాల్సిందేనని కృష్ణా బోర్డు మరోసారి స్పష్టం చేసింది. ప్రాజెక్టుపై సీఆర్పీఎఫ్బలగాల పహారా కొనసాగుతుందని తేల్చిచెప్పింది. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు కృష్ణా బోర్డుకు అప్పగింతపై కేఆర్ఎంబీ చైర్మన్ శివ్నందన్ కుమార్చాంబర్లో గురువారం నిర్వహించిన మీటింగ్మినిట్స్ను శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. జనవరి 17న జలశక్తి శాఖ సెక్రటరీ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో చర్చించిన అంశాలపై జారీ చేసిన మినిట్స్పై తెలంగాణ అభ్యంతరాలు తెలుపుతూ రాసిన లేఖను మినిట్స్కు జత చేశారు.
ఏపీ భూభాగంలోని అన్ని ఔట్లెట్లను బోర్డుకు అప్పగించడానికి అభ్యంతరం లేదని ఏపీ ఈఎన్సీ తెలిపారని, అదే సమయంలో తెలంగాణ భూభాగంలోని ఔట్లెట్లను స్వాధీనం చేసుకోవాలని కోరారని తెలిపారు. తెలంగాణ ఈఎన్సీ స్పందిస్తూ తమ రాష్ట్రంలోని పవర్హౌస్లను బోర్డుకు అప్పగించడానికి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు టీఎస్జెన్కో అనుమతి కూడా తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారని వెల్లడించారు. ఒకవేళ కేఆర్ఎంబీకి ఆయా ప్రాజెక్టుల ఔట్లెట్లను అప్పగిస్తే రెండు రాష్ట్రాల నుంచి వాటి నిర్వహణకు సమాన సంఖ్యలో సిబ్బందిని నియమించాలని, వారి జీతభత్యాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే చెల్లించాలని సమావేశంలో చర్చించారు.
15 ఔట్లెట్ల నిర్వహణకు ఎంత మంది సిబ్బంది అవసరమో రెండు రాష్ట్రాలు వారం రోజుల్లోగా లెక్కతేల్చి బోర్డుకు సమాచారం ఇవ్వాలన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్పై ఉన్న 15 ఔట్లెట్లను పూర్తి స్థాయిలో అప్పగించాల్సిందేనని సమావేశంలో చైర్మన్సూచించారని పేర్కొన్నారు. రెండు భారీ ప్రాజెక్టుల నిర్వహణను చూడాలంటే వ్యయప్రయాసలతో కూడుకున్నదని, అందుకే రెండు ప్రభుత్వాలు రెగ్యులర్గా బోర్డుకు ఫండ్స్రిలీజ్చేస్తామని హామీ ఇవ్వాలని సమావేశంలో చైర్మన్ కోరారు.
ప్రాజెక్టులు ఇస్తామని ఒప్పుకోలే : రాహుల్బొజ్జ
కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగిస్తామని తాము ఒప్పుకోలేదని, మీడియా తప్పుగా ప్రజెంట్ చేసిందని ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జ ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ గెజిట్జారీ చేసిన తర్వాత కామన్ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తామని ఆనాటి ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందని, అందుకు ముందస్తు షరతులు కూడా విధించిందని తెలిపారు.
పది ఔట్లెట్లు కేఆర్ఎంబీ నిర్వహణలోనే : ఈఎన్సీ మురళీధర్
శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుల్లో తెలంగాణకు సం బంధించిన పది ఔట్లెట్లు కేఆర్ఎంబీ నిర్వహ ణలోనే ఉంటాయని ఈఎన్సీ మురళీధర్ తెలి పారు. శుక్రవారం జలసౌధలో మీడియాతో మాట్లాడారు. కేఆర్ఎంబీ మెంబర్సెక్రటరీ, 2 రాష్ట్రాల ఈఎన్సీలు సభ్యులుగా ఉన్న త్రీ మెం బర్కమిటీ ఆయా ఔట్లెట్ల నిర్వహణను మానిటరింగ్చేస్తుందని తెలిపారు. తెలంగాణ భూభాగంలోని ఔట్లెట్లను మన రాష్ట్రం సిబ్బందే నిర్వహిస్తారని, ఏపీ సిబ్బంది కూడా ఆ ఔట్లెట్పై విధుల్లో ఉంటారని తెలిపారు.