ఉన్నది సరిపోదా.. ఇంకా కావాలా.. ఎందుకమ్మా నీకివన్నీ

ఉన్నది సరిపోదా.. ఇంకా కావాలా.. ఎందుకమ్మా నీకివన్నీ

ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది బెంగళూర్ బ్యూటీ కృతిశెట్టి. మొదటి సినిమాతోనే ఇటు స్టార్ హీరోలన్ల లిస్టులోకి అలాగే వందకోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. దీంతో టాలీవుడ్ లో వరుస క్రేజీ ఆఫర్స్ అందుకుంది. కానీ ఉప్పెన ఇచ్చిన సక్సెస్ ను మాత్రం కంటిన్యూ చేయలేకపోయింది. ఆమె హీరోయిన్ గా వచ్చిన శ్యామ్ సింగారాయ్,వారియర్,మాచర్ల నియోజకవర్గం,కస్టడీ వంటి సినిమాలు వరుసగా డిజాస్టర్స్ అయ్యాయి.

దీంతో ఈ బ్యూటీ రేస్ లో వెనుకబడిపోయింది. ఇదిలా ఉంటే.. ఓ వైపు సినిమాల ఫ్లాప్స్‌తో సతమతమవుతున్న కృతికి.. మరో సమస్య ఎదురైంది. అదేంటంటే ఈ మధ్య కృతి ఫేస్‌లో కాస్త మార్పులు కనిపిస్తున్నాయని, ఆమె ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకుందనే ప్రచారం జరుగుతుంది. దీంతో నెటిజన్స్ ట్రోల్ల్స్ తో రెచ్చిపోయారు. ఇప్పుడున్నది సరిపోదా? ఇంకా కావాలా? అంటూ ట్రోల్స్ చేశారు.  ఈ ట్రోల్స్ కృతి వరకు చేరాయి. దీంతో తాజాగా ఆమె ఈ రూమర్స్‌పై స్పందించింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి.. 'ఇలాంటివి ఎవరు, ఎందుకు రాస్తారో అర్థం కాదు. మాకు కూడా ఫ్యామిలీస్‌ ఉంటాయి. ఇలాంటివి విన్నప్పుడు వాళ్ళు చాలా బాధపడతారు. ఇప్పుడు నేను ఉప్పెనలో ఉన్నట్లు లేను అంటున్నారు. ఎప్పుడూ ఒకేలా ఉండలేము కదా..ఫీచర్స్‌ అనేవి మారుతూనే ఉంటాయి. అందరిలానే నేను కూడా. కొన్నిసార్లు మేకప్‌, హెయిర్‌ స్టైల్‌ వల్ల కూడా మార్పులు కనిపిస్తాయి. అంతమాత్రానా ప్లాస్టిక్‌ సర్జరీ అంటారా''? అంటూ బేబమ్మ ఫైర్‌ అయ్యింది. ప్రస్తుతం కృతి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.