ఆదిపురుష్ పై విమర్శలు.. స్పందించిన కృతి తల్లి

ఆదిపురుష్ పై విమర్శలు.. స్పందించిన కృతి తల్లి

ఆదిపురుష్(Adipurush) సినిమాపై వస్తున్న విమర్శలపై కృతి సనన్(kriti sanon) తల్లి గీతా సనన్(Geetha sanon) ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించారు. మనం సరైన దృష్టితో చూసినప్పుడే ప్రపంచం మనకు అందంగా కనిపిస్తుంది అంటూ ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. ఇంకా గీతా సనన్ ఆదిపురుష్ సినిమా గురించి మాట్లాడుతూ.. ‘‘ప్రజలు ఒక నిర్దిష్ట విషయాన్ని మంచి మనస్తత్వం, ఆలోచనతో చూడాలి. మనకు భగవంతుడైన రాముడు ప్రేమను పంచమని బోధించాడు. శబరి రాముడికి అందించిన ప్రేమను చూడాలి. కానీ ఆ వ్యక్తి తప్పులను చూడకూడదు. ఎదుటి వారి భావోద్వేగాలను మనం అర్థం చేసుకోవాలి. జై శ్రీరామ్’’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం గీతా సనన్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), కృతి సనన్ జంటగా నటించిన ఆదిపురుష్ మూవీ జూన్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డైరెక్టర్ ఓం రౌత్(Om Raut) ఈ సినిమాను తెరకెక్కించాడు. రామాయణం(Ramayanam) ఇతిహాసం ఆధారంగా రావడంతో సినిమాపై తీవ్ర విమర్శలు వచ్చాయి. విడుదలైన మొదటి షో నుంచే.. సినిమాలోని డైలాగ్స్, పాత్రలపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. రామాయణాన్ని అవమానించారని హిందూ సంఘాలు హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. ఇక తాజాగా ఇదే ఇష్యూపై కృతి సనన్ తల్లి గీతా సనన్ స్పందించింది.