సాగర్​ డ్యామ్​ను సందర్శించిన కేఆర్ఎంబీ బృందం

సాగర్​ డ్యామ్​ను సందర్శించిన కేఆర్ఎంబీ బృందం

హాలియా, వెలుగు: నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ డ్యామ్ ను కృష్ణా రివర్​మేనేజ్​మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ) అధికారుల బృందం  గురువారం సందర్శించింది. తెలంగాణ ప్రభుత్వం డ్యామ్ కు వేసవి కాలంలో చేపట్టాల్సిన రిపేర్లను ఇటీవల ప్రారంభించింది. సాగర్​జలాల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదం నెలకొన్న టైంలో, రిపేర్లు చేయడమేమిటని ఏపీ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం తెలిపింది.

వెంటనే రిపేర్లు నిలిపివేయాలని కోరుతూ కేఆర్ఎంబీకి లెటర్​రాసింది. రిపేర్లకు కేఆర్ఎంబీ కూడా అభ్యంతరం తెలిపింది. ఈ నేపథ్యంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ వరలక్ష్మి ఆధ్వర్యంలో కేఆర్ఎంబీ బృందం గురువారం నాగార్జున సాగర్ డ్యామ్​ను సందర్శించి, అక్కడి పరిస్థితి సమీక్షించింది. శుక్రవారం కూడా రిపేర్లను పర్యవేక్షించనుంది.