ముంబై: మాగ్నెట్ వైండింగ్ వైర్ల తయారీ సంస్థ కేఎస్హెచ్ ఇంటర్నేషనల్ ఐపీఓ ఈ నెల 16–18 తేదీల్లో ఉంటుంది. ప్రైస్బ్యాండ్ను రూ.365–384 మధ్య నిర్ణయించారు. కంపెనీ రూ.710 కోట్లు సమీకరించనుంది. షేర్లు ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో లిస్ట్ అవుతాయి.
పూణేకు చెందిన ఈ కంపెనీ ఐపీఓలో రూ.420 కోట్ల విలువైన ఫ్రెష్ఇష్యూ, ప్రమోటర్ల ద్వారా రూ.290 కోట్ల విలువైన ఓఎఫ్ఎస్ ఉంటుంది. కొత్త షేర్ల జారీ ద్వారా వచ్చే నిధులను అప్పుల చెల్లింపు కోసం, ఫెసిలిటీల విస్తరణ కోసం, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగిస్తారు.

