కేటీఆర్ అభినవ గోబెల్స్ లాగా తయారయ్యారు : కేకే మహేందర్ రెడ్డి

కేటీఆర్ అభినవ గోబెల్స్ లాగా తయారయ్యారు : కేకే మహేందర్ రెడ్డి

ఎమ్మెల్యే కేటీఆర్ పై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి. కేటీఆర్ అభినవ గోబెల్స్ లాగా తయారయ్యారని విమర్శించారు. తనను బీఆర్ఎస్ లోకి రమ్మని ఇబ్బంది పెట్టారని చెప్పారు. తన ఫోన్ ట్యాపింగ్ అయిందని కంప్లైంట్ ఇవ్వగానే కేటీఆర్ కి పూనకం వచ్చిందని ఎద్దేవా చేశారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం తను అనుమానం వ్యక్తం చేసి ఫిర్యాదు ఇస్తే కేటీఆర్ పరువునష్టం నోటీస్ పంపించారని చెప్పారు. గాంధీ భవన్ లో  కేకే మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 

కేటీఆర్ మాత్రం తమ నాయకులపై అనుమానం ఉందని చెబుతున్నారని తాను పరువు నష్టం నోటీస్ పంపించాలా అని ప్రశ్నించారు.  ఇంకా అధికారంలోనే ఉన్నానని కేటీఆర్ అనుకుంటున్నారని ఆయన ఇచ్చిన నోటీస్ చట్టానికి విరుద్ధంగా ఉందని చెప్పారు. కేటీఆర్ తనను బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేస్తానని చెప్పారు. కేసీఆర్ కుటుంబంలో ఒకరిపై ఒకరికి నమ్మకం లేదని విమర్శించారు. తనకు, జిట్టా బాలకృష్నా రెడ్డికి, రఘునందన్ లకు మీరు చేసిన మోసం పరిస్థితి ఎంటని కేకే ప్రశ్నించారు.