తప్పుడు ప్రచారం వద్దు.. పార్టీ శ్రేణులకు కేటీఆర్​ విజ్ఞప్తి

తప్పుడు ప్రచారం వద్దు.. పార్టీ శ్రేణులకు కేటీఆర్​ విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: ‘‘కాంగ్రెస్​ఎమ్మెల్యేలను లాక్కొని బీఆర్ఎస్​ ప్రభుత్వం ఏర్పాటవుతుంది. కాంగ్రెస్​ప్రభుత్వం పడిపోతుంది.  పడగొడుతున్నాం..” అంటూ సోషల్​మీడియాలో ఫేక్​ ప్రచారాలు చేయొద్దని పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్​ వర్కింగ్​ప్రెసిడెంట్​కేటీఆర్​విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఈ మేరకు ఆయన ట్వీట్​చేశారు. ఎన్నికల్లో బీఆర్ఎస్​ఓటమి తర్వాత ప్రజల నుంచి సానుభూతి వ్యక్తమవుతోందని, కేసీఆర్​మళ్లీ సీఎం అయితే బాగుండు అనే భావన వారిలో ఉందని ఆయన తెలిపారు. కానీ, ప్రజల తీర్పును గౌరవిస్తామని, కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తామని హుందాగా ప్రకటించామని.. ఇలాంటి పరిస్థితుల్లో తప్పుడు​ప్రచారం చేయడం తగదని, ఇలాంటి ప్రచారాన్ని ప్రజలు కూడా హర్షించబోరని ఆయన తెలిపారు.

ప్రజల ఆమోదంతో రెండు సార్లు కేసీఆర్​ప్రభుత్వం ఏర్పాటు చేశారని, భవిష్యత్​లోనూ ప్రజల ఆమోదంతోనే బీఆర్ఎస్​ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎంత హుందాగా ఉన్నామో, ప్రతిపక్షంలో అంతకన్నా రెట్టింపు హుందాతనంతో ప్రజల పక్షాన కొట్లాడుదామని కేటీఆర్​పార్టీ నేతలకు సూచించారు.