బీఆర్ఎస్ గెలిస్తే.. కాంగ్రెస్ కు హామీలు గుర్తొస్తయ్: కేటీఆర్

బీఆర్ఎస్ గెలిస్తే.. కాంగ్రెస్ కు హామీలు గుర్తొస్తయ్: కేటీఆర్

జూబ్లీహిల్స్ , వెలుగు : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్​గెలుపుతో కాంగ్రెస్​కు ఇచ్చిన హామీలు మళ్లీ గుర్తుకు వస్తాయని బీఆర్ఎస్ వర్కింగ్​ప్రెసిడెంట్​కేటీఆర్​అన్నారు. మంగళవారం ఎల్లారెడ్డిగూడ రోడ్  షోలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ రాకతో కరెంటు కష్టాలు మొదలయ్యాయని, ఇన్వర్టర్లు , జనరేటర్లు పెట్టుకునే  పరిస్థితులకు రాష్ట్రం వచ్చిందన్నారు. 

ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ అడ్డమైన హామీలు ఇచ్చిందని, బీఆర్​ఎస్​ను గెలిపించి కాంగ్రెస్​కు హామీలు గుర్తు చేయాలన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సునీతను గెలిపించుకోవాలన్నారు.