టిఆర్‌ఎస్ తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ : KTR

టిఆర్‌ఎస్ తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ : KTR

గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించాలని  TRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోమవారం కూకట్‌పల్లి నియోజకవర్గ టిఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన… హైదరాబాద్ ప్రజలు TRS  వైపు ఉన్నారని, ఈ విషయం గత కార్పొరేషన్ ఎన్నికల్లోనే నిరూపితమైందన్నారు. TRS ఇప్పుడు తెలంగాణ ప్రజల ఇంటి పార్టీగా మారిందన్నారు. తెలంగాణలో జరిగే ప్రతి ఎన్నికల్లో టిఆర్‌ఎస్ గెలుపు ఏకపక్షం కావాలని చెప్పారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా బీజేపీ నేత నడ్డా నాటకాలు తెలంగాణలో నడవవని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో BJPకి అధికారం జీవితాంతం ఆమడదూరంలోనే ఉంటుందని… ఆ పార్టీ నేతలు పగటికలలు కనడం మానుకోవాలని హితవు పలికారు కేటీఆర్.