రాజన్న సిరిసిల్ల : సిరిసిల్లలో లాక్ డౌన్ విధులు నిర్వహిస్తూ హోంగార్డు దేవయ్య(50) మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. హోంగార్డు కుటుంబానికి రూ.5 లక్షలు ఆర్థికసాయం ప్రకటించారు. ఆర్థికసాయంతో పాటు హోంగార్డు కుటుంబాన్ని ఆదుకుంటామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్లపల్లి మండలం, బద్దెనపల్లికి చెందిన సిలువేరి దేవయ్య సిరిసిల్ల పోలీస్ స్టేషన్ లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు.
బుధవారం పెట్రోల్ విధుల్లో ఉండగా.. సిరిసిల్లలోని ఎల్లమ్మ చౌరస్తాలో సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే హాస్పిటల్ కి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించిన డాక్టర్లు.. హోంగార్డు దేవయ్య వడదెబ్బ తగిలి చనిపోయినట్లుగా తెలిపారు.