కేసీఆర్ ను ఎవరైనా తిడితే పెద్దవార్త

కేసీఆర్ ను ఎవరైనా తిడితే పెద్దవార్త

కేంద్రం తెలంగాణకు తీరని అన్యాయం చేసిందన్నారు మంత్రి కేటీఆర్. ఐటీఐఆర్ పై బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ఆరేళ్లుగా సమస్యలపై రాంచంద్రారావు ఏంచేశారన్నారు కేటీఆర్. తెలంగాణకు నష్టం జరుగుతున్నా కేంద్రంలో ఉన్న బీజేపీని ప్రశ్నించే ధైర్యం లేదన్నారు. కేసీఆర్ ను ఎవరైనా తిడితే పెద్దవార్త అవుతుందన్నారు. బ్రాహ్మణుల సంక్షేమం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. హైదరాబాద్ దోమలగూడలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పీవీ వాణికి మద్దతుగా నిర్వహించిన బ్రాహ్మణుల సమన్వయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు.