- కోహ్లీ లెక్కనే కేసీఆర్సెంచరీ కొడ్తడు
- మూడోసారి ముఖ్యమంత్రి అయితడు: కేటీఆర్
- బీఆర్ఎస్లోకి గద్వాల కాంగ్రెస్నేత కురవ విజయ్కుమార్
హైదరాబాద్, వెలుగు : విరాట్ కోహ్లీ లెక్కనే కేసీఆర్అసెంబ్లీ ఎన్నికల్లో సెంచరీ కొట్టి మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని బీఆర్ఎస్వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం14 అసెంబ్లీ స్థానాలను గెల్వాలని, అందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. గద్వాల నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత కురవ విజయ్కుమార్, పాలకుర్తి, ముథోల్కు చెందిన ముఖ్య నేతలు తిరుపతి రెడ్డి, కిరణ్ వాగ్మోరే తదితరులు మంగళవారం బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘ఒకప్పుడు పాలమూరు అంటేనే మైగ్రేషన్.. ఇప్పుడు మహబూబ్నగర్ అంటే ఇరిగేషన్గా మారింది.14.50 లక్షల ఎకరాలకు నీళ్లు అందుతున్నాయి. పాలమూరు – రంగారెడ్డి పూర్తయితే ఇంకో 12 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి. కేసీఆర్ను కొట్టడానికి ఢిల్లీ నుంచి ఇంత మంది రావాలా’’ అని ప్రశ్నించారు.
ప్రధాని మోదీ, అమిత్ షా, కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ అగ్ర నేతలు,15 రాష్ట్రాల సీఎంలు తెలంగాణకు క్యూ కట్టారని, వాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. కేసీఆర్ సింహం లాంటోడని.. సింగిల్గానే వస్తారని చెప్పారు. ఓటుకు నోటుకు కేసులో దొరికిన రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయి సీట్లు అమ్ముకుంటున్నాడని ఆరోపించారు. రేపు పొరపాటున రేవంత్ సీఎం అయితే రాష్ట్రాన్ని అమ్మేయడం పక్కా అని విమర్శించారు. రూ.400లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని, రేషన్కార్డులున్నోళ్లకు సన్న బియ్యం, కేసీఆర్ బీమా సహా మేనిఫెస్టోలో పెట్టిన హామీలన్నీ అమలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, నాయకులు పొన్నాల లక్ష్మయ్య, దాసోజు శ్రవణ్, చిరుమిల్ల రాకేశ్, గెల్లు శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.
కేటీఆర్తో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు భేటీ
అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మంగళవారం బేగంపేట క్యాంపు ఆఫీస్లో కేటీఆర్ను కలిశారు. అశ్వరావుపేట కాంగ్రెస్ టికెట్ ఆశించినా తనకు ఇవ్వకపోవడంతో ఆ పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేసిన వెంకటేశ్వర్లు.. కేటీఆర్ను కలిసి బీఆర్ఎస్లో చేరడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపునకు తనవంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఒకటి, రెండ్రోజుల్లో ఆయన తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్లో చేరనున్నారు.
కాంగ్రెస్ పాపాలకు ప్రజలే శిక్షవేస్తారు..
చిత్రగుప్తుడు మనుషుల పాపాల చిట్టా రాసినట్టు కాంగ్రెస్ పాపాల గురించి శతకాలు, గ్రంథాలు రాయాల్సి వస్తుందని కేటీఆర్అన్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం రూపొందించిన ‘‘తెలంగాణలో కాంగ్రెస్ పాపాల శతకం’’, ‘‘స్కాంగ్రెస్” పుస్తకాలను ఆయన తెలంగాణ భవన్లో ఆవిష్కరించి మాట్లాడారు. దేశానికి, రాష్ట్రానికి కాంగ్రెస్చేసిన అన్యాయాలను, ఆ పార్టీ చేసిన కుంభకోణాలను ఈ పుస్తకాల్లో సవివరంగా చెప్పారన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పూర్తిగా గాలికొదిలేసి దోచుకోవడమే పనిగా పెట్టుకుందన్నారు. ఆ పాపాల చిట్టాను దేశ, రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉందన్నారు.