హనుమకొండ, కేయూ క్యాంపస్, వెలుగు : కాకతీయ యూనివర్సిటీలో కామన్ మెస్లో బుధవారం రాత్రి భోజనం చేస్తున్న ఓ విద్యార్థి ప్లేట్లో బొద్దింక కనిపించింది. పచ్చడిలో బొద్దింక కనిపించగా, విషయాన్ని మెస్కేర్టేకర్ల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా.. వారు పరారయ్యారని స్టూడెంట్స్ ఆరోపిస్తున్నారు.ఈ సందర్బంగా బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నం కామన్ మెస్ వద్ద నిరసన వ్యక్తం చేశారు.
బీసీ విద్యార్థి సంఘం నాయకుడు ఆరెగంటి నాగరాజు మాట్లాడుతూ గత ఏప్రిల్, మే నెలల బిల్లుల్లో హాస్టల్ డైరెక్టర్, సూపరింటెండెంట్ అవినీతికి పాల్పడ్డారని, దీనిపై విచారణ జరిపించాలన్నారు. హాస్టల్డైరెక్టర్, కేర్టేకర్లను తొలగించాలని డిమాండ్చేశారు. బీసీ విద్యార్థి సంఘం నాయకులు మురళి, నర్సింహ, చందు, నవీన్, రమేశ్, రవి, మధు, వెంకటేశ్, వినోద్ఉన్నారు. అయితే మెస్ సిబ్బంది, డైరెక్టర్పై కావాలనే కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని మరికొందరు విద్యార్థులు ఆరోపిస్తున్నారు.