కుంభం అనిల్ మళ్లీ కాంగ్రెస్​లోకి

కుంభం అనిల్ మళ్లీ కాంగ్రెస్​లోకి

హైదరాబాద్, వెలుగు : యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన కుంభం అనిల్ కుమార్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్​పార్టీలో చేరారు. సోమవారం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సోమవారం సాయంత్రం జూబ్లీహిల్స్​లోని అనిల్ ఇంటికి రేవంత్ వెళ్లారు. అనిల్​కు రేవంత్​ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. భువనగిరి జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న కుంభం అనిల్​ కుమార్​ రెడ్డికి.. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కొన్నాళ్లుగా విభేదాలున్నాయి. తన ఓటమికి కోమటిరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. 

మండల కమిటీల నియామకాలతో అవి మరింత పెరిగాయి. పార్టీకి రాజీనామా చేసి జులై 24న కేసీఆర్​ సమక్షంలో బీఆర్​ఎస్​లో చేరారు. అయితే, రెండు నెలల్లోనే సీన్​ రివర్స్​ అయింది. భువనగిరి టికెట్​ను అనిల్ ఎక్స్ పెక్ట్​ చేశారు. మళ్లీ సిటింగ్ ఎమ్మెల్యే అయిన పైళ్ల శేఖర్​ రెడ్డికే కేసీఆర్​ టికెట్​ను ప్రకటించడంతో.. కుంభం అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మళ్లీ కాంగ్రెస్​లోకి వచ్చేం దుకు కొన్నాళ్లుగా ప్రయత్నాలు చేశారని పార్టీ నేతలు చెప్తున్నారు. కాంగ్రెస్​లో పార్టీలో చిన్న చిన్న సమస్యలు సహజమని రేవంత్ రెడ్డి అన్నారు. 2018 ఎన్నికల్లో ఓడినా అనిల్​ను కాపాడుకుంటూ వచ్చామని గుర్తు చేశారు. సర్వేలో అనిల్ ను తిరిగి పార్టీలోకి తీసుకోవాలని తేలిందని చెప్పారు.