![మేడిగడ్డ ఏడో బ్లాక్ను బాగుచేస్తాం: ఎల్అండ్టీ ప్రకటన](https://static.v6velugu.com/uploads/2023/11/l-and-t-company_tLT37UpuSB.jpg)
హైదరాబాద్,వెలుగు: మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాక్పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నామని ఎల్అండ్టీ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన డిజైన్లు, నాణ్యత ప్రమాణాలకు లోబడే తాము బ్యారేజీని నిర్మించి 2019లో ప్రభుత్వానికి అప్పగించామని తెలిపింది. గత ఐదేళ్లుగా భారీ వరదలను తట్టుకొని బ్యారేజీ నిలిచిందన్నారు. బ్యారేజీకి సంబంధించిన అంశం ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉందని, దెబ్బతిన్న ఏడో బ్లాక్పునరుద్ధరణపై ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా పనులు చేస్తామని ప్రకటనలో పేర్కొన్నారు.