V6 News

గూడ్స్ వాహనం ఢీకొని కూలీ మృతి

గూడ్స్ వాహనం ఢీకొని కూలీ మృతి

శామీర్ పేట, వెలుగు: గూడ్స్​ వాహనం ఢీకొని బైక్​పై వెళ్తున్న కూలీ మృతి చెందాడు. శామీర్​పేటకు చెందిన వల్లెపు శ్రీనివాస్(52) రాయి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం నాల్సార్ జంక్షన్ నుంచి తన ఇంటి వైపు బైక్​పై వెళ్తున్నాడు. శామీర్ పేట సమీపంలో అశోక్ లీలాండ్ గూడ్స్ వాహనం శ్రీనివాస్​ను ఢీకొట్టింది. దీంతో ఆయన తీవ్రగాయాలతో స్పాట్​లో మృతి చెందాడు.