గచ్చిబౌలి, వెలుగు: భవన నిర్మాణ పనులు చేస్తున్న ఇద్దరు కూలీలు ప్రమాదవశాత్తు బిల్డింగ్ పైనుంచి కింద పడ్డారు. ఇందులో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన ప్రకారం.. కొండాపూర్ రాఘవేంద్ర కాలనీలోని జెమ్ సర్వీస్ సెంటర్ వెనుక వైపు ఓ భవన నిర్మాణం జరుగుతోంది.
చత్తీస్గఢ్కు చెందిన చంద్రకుమార్(33), జమ్మన సోన్వానీ విక్కీ(23) ఈ భవన నిర్మాణంలో కూలీలుగా పనిచేస్తున్నారు. శుక్రవారం నాలుగో అంతస్తులో పనిచేస్తుండగా గోవా కర్రల మీద నుంచి ప్రమాదవశాత్తు కింద పడ్డారు. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని కొండాపూర్లోని ప్రైవేట్ దవాఖానకు తరలించగా చంద్రకుమార్ కొద్దిసేపటికే మృతిచెందాడు.
విక్కీ తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నాడు. గచ్చిబౌలి పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లారు. ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యంగా నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్పై కేసు నమోదు చేశారు.
